హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ 3 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మంగళవారం కాగజ్ నగర్ మీటింగ్లో పాల్గొంటారు. పార్టీ రాష్ట్ర ఆఫీసులో బుధవారం ఆఫీసు బేరర్లతో భేటీ కానున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు స్ట్రాటజీపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. గురువారం సంజయ్తో కలిసి నాగార్జున సాగర్ వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం తిరిగి బీజేపీ స్టేట్ ఆఫీసుకు చేరుకొని పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశమవుతారు.