భద్రాచలం  బీఆర్ఎస్​లో చిచ్చు! .. తాతా మధు నియామకంపై గుర్రుగా మండల కమిటీలు

భద్రాచలం  బీఆర్ఎస్​లో చిచ్చు! .. తాతా మధు నియామకంపై గుర్రుగా మండల కమిటీలు

భద్రాచలం, వెలుగు: ఎమ్మెల్సీ తాతా మధును భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్​చార్జిగా నియమించడాన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు ఇక్కడ ఏం పని అంటూ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. అక్కడ నాయకుల్లో సఖ్యత కుదర్చలేని ఆయన ఇక్కడ ఏం చేస్తారంటూ మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్​మండల కమిటీ అధ్యక్షులు, సభ్యులు తాతా మధుపై గుర్రుగా ఉన్నారు.

అభ్యర్ధి ఎవరైనా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నప్పటికీ ఇన్​చార్జ్​ విషయానికి వచ్చేసరికి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవల పక్క నియోజకవర్గం పినపాకలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో మహబూబాబ్​బాద్​ ఎంపీ మాలోత్​ కవిత, తాతా మధు మీటింగ్​ పెట్టినా భద్రచం నియోజకవర్గంలోని మండల కమిటీల నాయకులు వెళ్లలేదు. తాము రాము అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దాంతో భద్రాచలంలో నిర్వహించాల్సిన భారీ ర్యాలీని రద్దు చేశారు.

ALSO READ :సిరిసిల్ల అర్బన్ ​బ్యాంకు చైర్మన్‌‌పై .. రెండోసారి అవిశ్వాసం
 

కేటీఆర్ తేల్చుతారు!

నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జ్ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ తేలుస్తారని అసమ్మతివర్గం నాయకులు చెబుతున్నారు. రెండు రోజుల్లో వివాదానికి తెర పడుతుందని అంటున్నారు. ఇక్కడ మంత్రి పువ్వాడ​కు బలమైన వర్గం ఉంది. సీఎం కేసీఆర్​కోటరీలో కీలక నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి బంధువు కావడంతోనే తాతా మధుకు ప్రాధాన్యం లభిస్తోందని, జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మంలో ఏమీ చేయలేకపోయిన మధు ఇక్కడ ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇన్​చార్జ్​ను మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాగే స్థానికుడైన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణపై తప్పుడు ప్రచారాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలసాని కాంగ్రెస్​లోకి పోతున్నారని మీడియాకు చెబుతూ.. తప్పుదోవ పట్టిస్తోందని తాతా మధు వర్గమేనని ఆరోపిస్తున్నారు.