టాటా వెహికల్స్​ ధరల పెంపు

టాటా వెహికల్స్​ ధరల పెంపు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్​ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్​ ధరలను పెంచనుంది. ధరలను సగటున 0.7 శాతం పెంచనున్నట్లు ఢిల్లీ టాటా మోటార్స్ ఆదివారం తెలిపింది.   ఈ పెంపుదల ఫిబ్రవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని,  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ ధర పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ నిర్ణయం  తీసుకుంటున్నట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ పంచ్, నెక్సాన్  హారియర్ వంటి అనేక రకాల ప్యాసింజర్ వెహికల్స్​ను విక్రయిస్తోంది. మారుతీ సహా పలు ఆటోమొబైల్​ కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.