
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో టాటా పవర్ నికర లాభం వార్షికంగా 9 శాతం వృద్ధితో రూ. 1,017.41 కోట్లకు చేరుకుంది. ప్రధానంగా అధిక రాబడుల కారణంగా ఇది పెరిగింది. నికర లాభం క్రితం సంవత్సరం కాలంలో రూ.935.18 కోట్లు ఉంది. ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.14,181.07 కోట్ల నుంచి రూ.16,029.54 కోట్లకు పెరిగింది. నికర లాభంలో 84 శాతం ప్రధాన వ్యాపారాల నుంచి వచ్చింది. కంపెనీ క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియో 5,500 మెగావాట్ల మైలురాయిని సాధించింది.
ఇది మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో 38 శాతంగా ఉంది. నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడం, ఒడిషాలో ఏడీ, సీ నష్టాలను తగ్గించడం ద్వారా పంపిణీ వ్యాపారంలో గణనీయమైన పురోగతిని సాధించామని తెలిపింది. 2,800 మెగావాట్ల ప్రాజెక్టుల అభివృద్ధికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకం చేసింది. రెన్యువబుల్ఎనర్జీతోపాటు నుంచి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రేడింగ్, స్టోరేజ్ సొల్యూషన్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్ తయారీ తదితర వ్యాపారాలు టాటా పవర్ సొంతం.