
Air India Plane Crash: కొన్ని రోజుల కిందట జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్నే షాక్ కి గురిచేసింది. లండన్ వెళుతున్న విమానంలో 240కి పైగా ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పైగా టాటాలు నడుపుతున్న విమానయాన సంస్థలో ఇంత ప్రమాదం జరగటం ఉలిక్కిపడేలా చేసింది.
అయితే ప్రమాదం తర్వాత జరగిన తొలి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కీల నిర్ణయాల దిశగా చర్చించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మెుత్తం 271 కుటుంబాలకు సంస్థగా అండగా నిలవాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఇదే క్రమంలో రూ.500 కోట్లతో ప్రమాద బాధిత కుటుంబాల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు వెల్లడైంది. దీనికి ముందు భారతీయ కుటుంబాల కోసం ఒకటి, విదేశీ ప్రయాణికుల కుటుంబాల కోసం మరొక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు.
►Also Read : న్యూయార్క్ మేయర్ రేసులో భారత సంతతి వ్యక్తి
ఈ మెుత్తాన్ని బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు, ప్రభావితం అయిన వ్యక్తుల మెడికల్ ఖర్చులకు అలాగే విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ భవనం తిరిగి నిర్మించేందుకు ఉపయోగించాలని టాటా సన్స్ నిర్ణయించింది. దీని తర్వాత మిగిలిన మెుత్తాన్ని సదరు కుటుంబాలకు భవిష్యత్తులో ఉపయోగించేందుకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.
జూన్ 12న విమానం కూలిపోయిన ఘటనలో చనిపోయిన వ్యక్తులకు రూ.కోటి చొప్పున తొలుత పరిహారం అందించనున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. అలాగే ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎవరి తప్పు వల్ల జరిగిందనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు బ-ృందాలు కృషి చేస్తున్నాయి.