
Newyork Mayoral: అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ పదవి రేసులో ఒక భారతీయ సంతతి వ్యక్తి నిలవటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కామెంట్ చేయటం అందరినీ ఆకట్టుకుంటోంది. వాస్తవానికి అతని తల్లి అమెరికాలో స్థిరపడిన భారతీయురాలు కాగా తండ్రి గుజరాత్ మూలాలున్న ఉగాండా ముస్లిం జాతీయుడు.
జోహ్రాన్ తండ్రి మహమూద్ మమ్దానీ ఒక ఫ్రొఫెసర్. పైగా ఆఫ్రికా ఖండంలో జరిగిన అరాచక పాలన, రాజకీయాలపై అనేక రచనలు చేశారు. అలాగే ‘గుడ్ ముస్లిం.. బ్యాడ్ ముస్లిం’ అనే పుస్తకం కూడా రాశారు. అయితే జోహ్హాన్ 1991 అక్టోబర్ 18న ఉగాండా కంపాలాలో జన్మించినప్పటికీ వారి కుటుంబం అమెరికాకు వలస వచ్చి స్థిరపడింది. ప్రస్తుతం అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపధ్యంలో గెలుపు కూడా ఖాయం అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే జోహ్రాన్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రంగా మండిపడుతూ అతను కమ్యూనిస్ట్ భావజాలాలు కలిగిన పిచ్చోడంటూ కామెంట్ చేశారు.
జోహ్రాన్ వినూత్న ప్రచారం..
తాము ప్రజల మద్ధతు కారణంగానే 8 మిలియన్ డాలర్లు ఫండింగ్ ఎన్నికల కోసం పొందినట్లు తన వీడియోలో చెప్పాడు. దాదాపు ఆరు లక్షల ఓటర్ల ఇళ్లకు వెళ్లి క్యాంపెయిన్ చేశామని.. న్యూయార్క్ మేయర్ గా తనను ఎన్నుకుంటే నగరంలో ఆహారం నుంచి నివాసం వరకు అన్నింటినీ సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చేందుకు పోరాడతానన్నారు. అక్కడి ప్రజలు కనీసం అవసరాలైన ఆహారం, దుస్తులు, ఆశ్రయం కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాడు. తన కమ్యూనిటీతో పాటు ప్రతి న్యూయార్కర్ కోసం కష్టపడటానికి సిద్ధంగా ఉన్నట్లు టిక్ టాక్ వీడియోలో జోహ్రాన్ వెల్లడించారు. అలాగే ఓటింగ్ ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
Zohran Mamdani will probably become the new mayor of New York City
— Dhruv Rathee (@dhruv_rathee) June 25, 2025
This was his campaign video especially made for the people from indian subcontinent. Look at the creativity and boldness 👌
pic.twitter.com/tmhAKuQ1gd
జోహ్రాన్ మాట్లాడుతుంటే పాకిస్థాన్ పీఆర్ టీమ్ సెలవు తీసుకుంటోందని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు. మిత్రదేశాలతో' భారతదేశానికి శత్రువులు అవసరం లేదంటూ జోహ్రాన్ పై మండిపడ్డారు. ఇదే క్రమంలో బీజేపీ నేత కంగనా రనౌత్ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.