- వెబ్సైట్లో హాల్టికెట్లు పెట్టిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 10 నుంచి13 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అభ్యర్థుల హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు www.bse.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్లి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. వెబ్సైట్లో జిల్లా, ట్రేడ్ కోడ్, అభ్యర్థి పేరును ఎంచుకొని.. పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా హాల్టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు.
