నా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటే.. : చంద్రబాబు

నా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటే.. : చంద్రబాబు

గద్దర్‌‌ను చూస్తేనే ఓ ప్రజా యుద్ద నౌక గుర్తుకు వస్తుంది.. భయమంటే తెలియని వ్యక్తి గద్దర్.. పోరాటాలే ఆయన ఊపిరి అని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. అలాంటి వ్యక్తి మరణం బాధాకరమని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గద్దర్ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని.. ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు పని చేస్తామని చంద్రబాబు చెప్పారు. 

1997లో గద్దర్‌‌పై జరిగిన కాల్పుల ఘటనపై చంద్రబాబు స్పందించారు. కాల్పుల ఘటన విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని అపోహలు సృష్టించారన్నారు. నాటి కాల్పుల తర్వాత గద్దర్ నాతో అనేకసార్లు మాట్లాడారని తెలిపారు. ఇద్దరం కలిసి పని చేశామని.. నా లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒక్కటే. పేదల హక్కుల పరిరక్షణే మా ధ్యేయం అని వివరించారు.

ALSO READ :సిద్దిపేటకు ఐటీ హబ్ రావడంతో నా కల నెరవేరింది: మంత్రి హరీశ్​రావు

గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆగస్టు 15 మంగళవారం హైదరాబాద్ అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యంగా చెప్పారు.