పార్లమెంట్ లో వైసీపీ కి టీడీపీ ఆఫీస్ కేటాయింపు

పార్లమెంట్ లో వైసీపీ కి టీడీపీ ఆఫీస్ కేటాయింపు

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ పార్టీ తమ పార్టీ కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ లో టీడీపీ కార్యాలయంగా కొనసాగుతున్న రూమ్ ను లోకసభ స్పీకర్ కార్యాలయ అధికారులు వైసీపీ కి కేటాయించారు.

గురువారం వివిధ పార్టీలకు సంబంధించి స్పీకర్ కార్యాలయ సిబ్బంది పార్లమెంట్ లో ఆఫీస్ లను కేటాయించారు. పద్దతి ప్రకారం ఒక పార్టీకి ఐదు స్థానాల కంటే ఎక్కువున్న  పార్టీలకు ఎంపీల సంఖ్యను బట్టి  కార్యాలయాలు కేటాయించారు. టీఆర్ఎస్ పార్టీకి గతంలో ఉన్న కార్యాలయాన్ని మళ్లీ ఇచ్చారు. మొత్తం 14 పార్టీలకు స్పీకర్ కార్యాలయం కార్యాలయాలను కేటాయించింది.

TDP party lost its party office in Parliament