వచ్చే ఎన్నికల్లో  టీడీపీ సత్తా చూపిద్దాం..  మినీ మహానాడులో బాలయ్య

వచ్చే ఎన్నికల్లో  టీడీపీ సత్తా చూపిద్దాం..  మినీ మహానాడులో బాలయ్య

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో  సత్తా చూపిద్దామని టీడీపీ శ్రేణులకు నందమూరి బాలకృష్ణ పిలుపు నిచ్చారు. తెలంగాణ టీడీపీ లీడర్లు, కార్య కర్తలకు మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఖైర తాబాద్‌‌లో జరిగిన టీడీపీ మినీ మహా నాడు కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ తన భుజాల మీద మోశాడని బాలకృష్ణ అన్నారు. ఆయన తన జన్మను తెలుగుజాతికి అంకితం చేశాడన్నారు.

ఎన్‌‌టీఆర్‌‌‌‌కు భారతరత్న ఇవ్వాలని తెలుగు ప్రజల తరఫున కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా ఇప్పట్నుంచే కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీకి రాష్ట్రంలో పునర్ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.