ఐఆర్ ఏదీ …పీఆర్సీ ఏదీ?

ఐఆర్ ఏదీ …పీఆర్సీ ఏదీ?
  • సీఎం మాటలు నీటి మూటలేనా?
  • జీతాలెక్కువ ఇస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా అబద్ధా లా?
  • సీపీఎస్ ను రద్దు చేయాల్సిందే
  • ఇచ్చిన హా మీలు అమలు చేయకుంటే ఉద్యమమే
  • టీచర్లు, ఉద్యోగుల హెచ్చరిక
  • రాష్ట్ర వ్ యాప్తం గా హోరెత్తి న నిరసనలు
  • విద్రోహ దినంగా ‘సెప్టెంబర్ 1’.. సత్యాగ్రహ దీక్షలు

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్ )ను వెంటనే రద్దుచేయాలని, ఐఆర్,పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీచర్లు, ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆదివారం ఆందోళన చేపట్టారు. సీపీఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా పాటిస్తూ సత్యాగ్రహ దీక్షలు, ర్యాలీలు, ఇతర రూపాల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్క్‌‌ వద్ద టీచర్స్‌‌ జేఏసీ(జాక్టో) ఆధ్వర్యం లో ‘ఉపాధ్యాయ గర్జన’ నిర్వహించారు. 2018 మే 16న ప్రగతిభవన్‌‌లో ముఖ్యమంత్రి అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని జాక్టో నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తమది పసికూ న ప్రభుత్వమని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్‌‌  తొలి ఐదేండ్లు కాలం గడిపారని,రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటే ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌ కృష్ణయ్య అన్నారు . జూన్‌‌ 2న అందరికీ ఐఆర్‌‌ అని, ఆగస్టు 15న కడుపునిండా పీఆర్‌‌సీ ఇస్తా మని నమ్మబలికిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలుగానే మిగిలాయని హైదరాబాద్ లో జరిగిన ‘ఉపాధ్యాయ గర్జన’లో ఆయన మండిపడ్డా రు. బడ్జెట్ లో సగానికి పైగా ఉద్యోగుల వేతనాలకు, పింఛన్లకే ఖర్చవుతుందంటూ, ఏ రాష్ట్రంలో లేనంత మన రాష్ట్రంలోనే ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్‌‌ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు .అయితే.. దేశంలో వేతనాల చెల్లిం పులో తెలంగాణ 17వ స్థానంలో ఉందనే విషయం సీఎం గ్రహించాలని హితవుపలికారు. పింఛన్‌‌ పొందడం ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగం కల్పించి న హక్కని, నిర్ణీత కాలానికి ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు పింఛన్‌‌ సౌకర్యం ఉన్నప్పుడు, 30 ఏండ్లకు పైగా ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర పోషించే ఉద్యోగులకు మాత్రం వద్దా అని ప్రశ్నిం చారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు.. దీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, ఉద్యోగుల నిరసనలు హోరెత్తా యి. పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యం లో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట టీచర్లు సత్యాగ్రహ దీక్ష చేశారు . కోర్టు చౌరస్తా వద్ద నల్లచొక్కాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లిలో వివిధ టీచర్స్​ యూనియన్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు . జగిత్యా ల కలెక్టరేట్ ఎదుట పీఆర్ టీయూ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సిరిసిల్లలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యం లో నిరసన ర్యాలీ తీశారు . ఈ సందర్భంగా టీచర్స్​యూనియన్ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల రాష్ట్రంలోని 1.40 లక్షల మంది ఉద్యోగ, టీచ ర్లు ఇబ్బందులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు . వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని యూనియన్ వరంగల్ అర్బన్ జిల్లా కో ఆర్డి నేటర్ కోలా రాజేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు . ఆదిలాబాద్ లో పీఆర్ టీయూ ఆధ్వర్యం లో కలెక్టర్‍ ఆఫీసు ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు . నిర్మల్ లో టీయుటీఎఫ్ ఆధ్వర్యం లో ఆందోళన, పీఆర్టీయూ నేతృత్వం లో సత్యాగ్రహ దీక్ష చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తపస్ ఆధ్వర్యం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇంటి వరకు ర్యాలీ తీశారు. జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఆసిఫాబాద్ లో టీఎస్ పీఆర్ టీయూ ఆధ్యర్యం లో ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు . పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యం లో నిజామాబాద్ లోని ధర్నాచౌక్ లో నిర్వహించి న సత్యాగ్రహ దీక్షలో మాజీ ఎమ్మె ల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు . సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు . పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యం లో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారిన నూతన పెన్షన్ విధానాన్ని(సీపీఎస్) రద్దు చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్ డిమాండ్ చేశారు . ఖమ్మంలో నిర్వహించిన నిరసన ర్యాలీ లో ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొని, సీపీఎస్ రద్ధు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తా మ ని హెచ్చరిం చారు. వనపర్తి జిల్లాలో ఉద్యోగ, టీచర్స్​యూనియన్ నాయకులు సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి మెయిల్స్​పంపారు . యూఎస్ పీసీ, పీఆర్టీయూ, తపస్, వివిధ టీచర్ల సం ఘాల ఆధ్వర్యం లో నాగ ర్ కర్నూల్, గద్వాల, రాయణపేట, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు, ర్యాలీ లు నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్షలో పీఆర్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు పాల్గొన్నారు . లక్షలాది ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు జరిగిన ఆందోళనలో టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు జి.తిరుపతిరెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు . సంగారెడ్డి లో ఐబీ నుంచి పాత బస్టాండ్‌‌ వరకు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కలెక్టరేట్ ఎదుట పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.