కీచక టీచర్.. ఎనిమిదో తరగతి విద్యార్థినిపై వేధింపులు

 కీచక టీచర్.. ఎనిమిదో తరగతి విద్యార్థినిపై వేధింపులు

విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సక్రమమైన దారిలో పెట్టాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ లో చోటుచేసుకుంది. అత్తాపూర్ లోని  ఎస్ఆర్ డిజి  స్కూల్ లో విష్ణు అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. 

అయితే గత కొద్ది రోజులుగా విష్ణు..  ఆ స్కూల్ లో 8 తరగతి చదువుతోన్న విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తించడం మొదలుపెట్టాడు.  అంతేకాకుండా విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడంతో విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కు చేరుకుని దాడికి దిగారు. 

స్కూల్ లో ఉన్న ఫర్నీచర్, కంప్యూటర్ రూమ్ ను పగలగొట్టారు.   ఈ విషయం తెలుసుకున్న పీఈటీ టీచర్ ఫొన్ స్వీచ్ ఆఫ్  చేసి పరారయ్యాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పీఈటీ టీచర్ పై అత్తాపూర్  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.