హరీశ్​రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: ఉపాధ్యాయ సంఘం

హరీశ్​రావు తన  వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: ఉపాధ్యాయ సంఘం

మెదక్​ టౌన్​, వెలుగు : తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ఉద్యోగ, ఉపాధ్యాయులను అవమానించే విధంగా మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మెదక్​ జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) అధ్యక్ష, కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. శుక్రవారం వారు మెదక్​పట్టణంలోని తపస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధు ఆపి ఉద్యోగులకు జీతాలు ఇస్తారా అనడం సరైంది కాదన్నారు. 

రైతులను ఉద్యోగులపైకి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫస్ట్​తారీకు జీతాలు ఇస్తే హరీశ్​రావుకు  అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో తపస్ నాయకులు మాధవరెడ్డి, నర్సింలు, రాజు, శ్రీకాంత్ రెడ్డి, సిద్దు, నరేందర్, మధు మోహన్ పాల్గొన్నారు.