పీఆర్సీ పై సంప్రదింపులకు సీఎస్ కమిటీ తమను పిలవక పోవడంతో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరుకు నిరసనగా హైదరాబాద్ బీఆర్ కే భవన్ ముందు నిరసన తెలిపారు ఉపాధ్యాయ సంఘం నేతలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 45 శాతానికి తగ్గకుండా పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఉపాధ్యాయ సంఘం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే …అడ్డుకోవడం సరికాదన్నారు ఉపాధ్యాయ సంఘం నేతలు.
see more news
విషాదం.. అక్కసుతో పందెం ఎడ్లను చంపేశారు
‘మాస్టర్’ నిర్మాతకు అమెజాన్ కాసుల పంట