రెండో టెస్ట్‌‎పై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమిండియా ఫోకస్.. బుమ్రా ఔట్.. అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరికి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..!

రెండో టెస్ట్‌‎పై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమిండియా ఫోకస్.. బుమ్రా ఔట్.. అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరికి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..!

బెంగళూరు: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమిండియా సన్నాహాలు మొదలుపెట్టింది. స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండడని సంకేతాలు వస్తుండటంతో బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూర్పుపై ఆందోళన నెలకొంది. దీనికితోడు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేదికైన బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు ఇండియా రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవలేదు. ఈ క్రమంలో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా సమం చేస్తారనే సందేహాలు మొదలయ్యాయి. లీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 65 నుంచి 82 ఓవర్ల మధ్య మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేజారింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగకపోవడంతో  మిగతా వాళ్లు రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ చేయలేకపోయారు. 

అప్పటికే 19 ఓవర్లు బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన బుమ్రాను రెండో కొత్త బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కనబెట్టాడు. మిగతా బౌలర్లందరు కలిసి 15 ఓవర్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియంత్రించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికి ఇంగ్లండ్ విజయానికి ఇంకా 85 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరంలో ఉంది. చివరకు కొత్త బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బుమ్రా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగేసరికి ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 349 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. దాంతో మిగతా 22 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపాడటం బుమ్రా వల్ల కూడా కాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాను కాపాడలేకపోయిన మిగతా బౌలర్లపై గెలుపు భారం ఎలా పెడతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓకేనా..

రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా వికెట్లు పడకపోవడం దురదృష్టకరం. కానీ తొలి దశలో బుమ్రాపై ఒత్తిడి తగ్గించే క్రమంలో అతను కూడా బౌండ్రీలు ఇచ్చుకున్నాడు. ఇది చాలా మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఇప్పుడు రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బుమ్రా ఉండడు. అప్పుడు పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతలను మొత్తం సిరాజే మోయాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడిలో పడటం ఇండియాకు అత్యవసరం. ఇక ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ, శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కలిపి 16 టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అనుభవం మాత్రమే ఉంది. 

తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎక్కువగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చేయించకపోవడం ప్రతికూలంగా మారింది. హెడింగ్లీలో ఐదు వికెట్లు తీసిన ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యూహాన్ని అనుసరించి తప్పు చేశాడు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ఎక్కువగా ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మాత్రమే ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

 ఇలాంటి లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లకు సవాలు విసురుతాడా..? చూడాలి. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్న మార్పు చేసుకుంటే ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీన్ని సాధిస్తాడని మాజీ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొడ్డా గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. ‘ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాతావరణ పరిస్థితులను బట్టి బాల్ రెండు వైపులా స్వింగ్ అవుతుంది. బుమ్రా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసరిస్తే సరిపోతుంది. ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి’ అని గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. 

కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తే లాభమా..? నష్టమా..?

రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకు రావాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కానీ ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకే ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడాడు. ఇక 2024లో బెంగళూరులో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడిన చివరి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్దగా ఆకట్టుకోలేదు. రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5.3, 8.6 ఎకానమీని నమోదు చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. 

ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జడేజా.. కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అద్భుతంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అతని ఎకానమీ 3.6గానే ఉంది. ఒకవేళ అప్పట్లో వేసిన లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జడేజా పట్టుకోగలిగితే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చుక్కలు చూపడం పెద్ద కష్టం కాదు. డకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడే పరిస్థితి ఉండదు. రెండో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడించాలని కచ్చితంగా అనుకుంటే మాత్రం వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే బాగుంటుంది. 

లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా మార్పులు చూపెడతాడు. మెరుగైన బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా. ఏ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేపరు మీద బలంగానే కనిపిస్తున్న ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై కచ్చితమైన దృష్టి పెడితే సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతారు. లేదంటే మరో ఓటమి తప్పదు. 

అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గౌతీ చర్చలు..

గురువారం అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేద తీరిన టీమిండియా శుక్రవారం ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొంది. ప్లేయర్లందరూ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీవ్రంగా చెమటోడ్చారు. అయితే బుమ్రా మాత్రం ఎలాంటి ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీలో పాల్గొనలేదు. ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానీ, డ్రిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానీ చేయలేదు. సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

బుమ్రా ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తారని భావిస్తున్న అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మిగతా బౌలర్లు బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కొంత మంది ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు జూనియర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు.