ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్య

ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్య

జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఓ యువతి మనస్తాపానికి గురై ఆత్యహత్యకు పాల్పడింది. మే 25 గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. తమ పెళ్లి నిశ్చయించుకునే విషయంలో మనస్పర్థలు రావడంతో నగర శివార్లలోని జవహర్‌నగర్‌లో తన ప్రియుడి ఇంట్లోనే పూజ అనే అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “మెహిదీపట్నంకు చెందిన బి. పూజ(18) చైతన్యపురిలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతోంది. అదే సమయంలో జవహర్‌నగర్‌లోని యాప్రాల్‌కు చెందిన దయాకర్‌ అనే వ్యక్తితో పరియం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న దయాకర్ తల్లి తన కొడుకుతో కలవొద్దని పూజను బెదిరించింది. అటు కొడుకును కూడా హెచ్చరించింది. అంతేకాదు అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడింది. దీంతో గురువారం దయాకర్ పూజకు ఫోన్ చేసి రమ్మనాడు.. వారిద్దరూ చైతన్యపురిలో కలుసుకొని అక్కడ నుండి దయాకర్ ఆమెను జవహర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. వారిద్దరూ ఇంట్లోకి రాగానే దయాకర్ కు తల్లికి గొడవ జరిగింది. ఈ క్రమంలో పూజ ఒక గదిలోకి పరుగెత్తి లోపలి నుండి తలుపు గడియ పెట్టుకుంది. స్తాపాని గురై రూంలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది” అని జవహర్‌నగర్ పోలీసులు తెలిపారు. దయాకర్, అతని తల్లిపై IPC సెక్షన్ 306 కింద కేసు నమోదు చేకుకొని దర్యప్తు చేస్తున్నారు.