బోధన్, వెలుగు : జక్రాన్పల్లికి చెందిన దళిత యువతి తేజశ్రీని ప్రేమ పేరుతో మోసం చేసి, హత్యాయత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ట్రాక్ కోర్డు ద్వారా విచారించాలని ఎమ్మార్పీఎస్లీడర్లు డిమాండ్చేశారు. మంగళవారం బోధన్ అంబేద్కర్చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బోధన్ఆర్డీవో రాజేశ్వర్కు వినతిపత్రం అందించారు.
కొన ఊపిరితో నిజామాబాద్హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న యువతికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్జిల్లా కార్యదర్శి లక్ష్మీగారి భూమయ్య, సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి, బోధన్పట్టణాధ్యక్షుడు తాడెం అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.