జక్రాన్​పల్లికి చెందిన దళిత యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు

జక్రాన్​పల్లికి చెందిన దళిత యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు

బోధన్, వెలుగు : జక్రాన్​పల్లికి చెందిన దళిత యువతి తేజశ్రీని ప్రేమ పేరుతో మోసం చేసి, హత్యాయత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి  ఫాస్ట్​ట్రాక్​ కోర్డు ద్వారా విచారించాలని ఎమ్మార్పీఎస్​లీడర్లు డిమాండ్​చేశారు. మంగళవారం బోధన్​ అంబేద్కర్​చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బోధన్​ఆర్డీవో రాజేశ్వర్​కు వినతిపత్రం అందించారు. 

కొన ఊపిరితో నిజామాబాద్​హాస్పిటల్​లో కొట్టుమిట్టాడుతున్న యువతికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​జిల్లా కార్యదర్శి లక్ష్మీగారి భూమయ్య, సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి, బోధన్​పట్టణాధ్యక్షుడు తాడెం  అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.