కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కులగణన తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కులగణనతో  అన్ని వర్గాలకు  న్యాయం చేస్తామన్నారు పొన్నం. కులగణనపై రాజకీయాలు చేయొద్దన్నారు.  కులగణనపై ఎవరికీ  అనుమానం అవసరం లేదన్నారు.  అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు.

  నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు పొన్నం.   పదేండ్ల బీసీల లెక్కలు తీస్తే  బీఆర్ఎస్ బండారం బయటపెడ్తామన్నారు.    సమగ్ర సర్వే వివరాలు  బయటపెడ్తే తమకు ఖర్చు తగ్గుతదని చెప్పారు. గత ప్రభుత్వం ఎంబీసీలకు వెయ్యి కోట్లు ప్రకటించి వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టలేదని విమర్శించారు.

also read : బలహీన వర్గాల బలోపేతం కోసమే కుల గణన : సీఎం రేవంత్ రెడ్డి

బీసీ మంత్రిత్వ శాఖ కోసమే తాము పోరాటం చేశామన్నారు పొన్నం ప్రభాకర్.  బలహీన వర్గాల కోసమే తమ పోరాటమని చెప్పారు.  బీజేపీ బీసీ ప్రెసిడెంట్ ను తీసేసి.. బీసీఎల్పీ లీడర్ ను కూడా చేయలేకపోయియిందన్నారు.  ఉరికేవాళ్లకు  కాళ్లు అడ్డుపెట్టి పగొట్టొద్దని ప్రతిపక్షాలకు రిక్వెస్ట్ చేశారు పొన్నం.  ఈ సర్వే రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు.  2011 చట్టం చేయకుండానే ఓబీసీల కులగణన జరిగిందని చెప్పారు పొన్నం.

కులగణను స్వాగతిస్తున్నాం: కేటీఆర్

చట్టబద్ధత ఉంటేనే కులగణనకు అర్థం ఉంటుందన్నారు కేటీఆర్.  చట్టబద్ధత లేకుంటే కులగణన సఫలం కాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉందన్నారు.  బీసీల డిక్లరేషన్ లో ఉన్న అన్ని అంశాలను  అమలు చేయాలి.. అపుడే కులగణన సఫలం అవుతుందని చెప్పారు. మరో రెండు రోజులు  అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలి.. కులగణనపై బిల్లులు  తీసుకురావాలని సూచించారు కేటీఆర్.