ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నారు. శాసన సభ, మండలి సమావేశాలు ముగిసి ఈనెల 25తో ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని గురువారం కేబినెట్‌‌‌‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌‌‌‌ తమిళిసై సౌందర రాజన్‌‌‌‌ అనుమతితో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై సభ ప్రారంభమైన రోజే బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.