Telangana : ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు

Telangana : ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది. అసెంబ్లీ, మండ‌లి సమావేశాలపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందింది. రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24  సంబంధించి సీఎం కేసీఆర్ ఇవాళ మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.