
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరసనగా 2025, అక్టోబర్ 14న బీసీ సంఘాలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో బీసీ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 14న తలపెట్టిన తెలంగాణ బంద్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. 14వ తేదీకి బదులు అక్టోబర్ 18న తెలంగాణ బంద్ నిర్వహిస్తామని వెల్లడించాయి. ఆదివారం (అక్టోబర్ 12) లక్డీకపూల్లోని అశోక హోటల్లో బీసీ సంఘాలు సమావేశమయ్యాయి.
ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై ఐక్యంగా పోరాడటం కోసం బీసీ సంఘాలన్నీ బీసీ జీఏసీగా ఏర్పడ్డాయి. బీసీ జేఏసీ చైర్మన్గా రాజ్య సభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మెన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్లుగా దాసు సురేష్, రాజారామ్ యాదవ్లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలోనే అక్టోబర్ 14న తలపెట్టిన బీసీ సంఘాల తెలంగాణ బంద్ను ఈ నెల 18కి వాయిదా వేయాలని నిర్ణయించారు.