హైదరాబాద్: డా అంబేద్కర్ దార్శనికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్దంగా సాధ్యమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దేందుకు, బాబాసాహెబ్ అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనని కేసీఆర్ అన్నారు. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని సీఎం గుర్తు చేసుకున్నారు. వేలకోట్ల రూపాయలను ఖర్చు చేసి అనేక పథకాలను వినూత్న రీతిలో ప్రభుత్వం అమలు పరుస్తున్నదని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసి, సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో అమలు పరుస్తున్న ఆర్ధిక సమాజిక విధానాలలో బాబాసాహెబ్ ఆశయాలు ఇమిడివున్నాయని సిఎం తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రత్యేక ప్రగతినిధి ( ఎస్సీ సబ్ ప్లాన్) చట్టం ఏర్పాటు చేశామన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ప్రైడ్ కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పే దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలందిస్తున్నదన్నారు. మార్కెట్ కమిటీల్లో కాంట్రాక్టు పనుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురుకులాలు సాధిస్తున్న అద్భుత విజయాలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గురుకులాలల్లో నాణ్యమై విద్యతోపాటు పలు అనుబంధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తున్నదని వివరించారు. ప్రపంచంతో పోటీ పడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దళిత గిరిజన బిడ్డలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతుండడాన్ని ప్రపంచం ప్రశంసిస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. విదేశీ విద్యా నిధి ద్వారా దళిత గిరిజన బిడ్డలకు ప్రభుత్వం విదేశీ విద్యనందిస్తున్నదని తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కుల రహిత సమాజానికి బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్బంగా సిఎం తెలిపారు.
అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ వచ్చింది:కేసీఆర్
- తెలంగాణం
- April 14, 2021
లేటెస్ట్
- RCB vs SRH మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు
- మోదీ వంద మంది హిట్లర్లతో సమానం
- కాంగ్రెస్లో చేరిన వట్టికూటి
- వరంగల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్
- రూ. 5 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టారు
- ఇల్లిల్లు తిరిగి అడుక్కున్నా..కేసీఆర్ను జనం క్షమించరు: సీఎం రేవంత్ రెడ్డి
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- ఎంసీఎంసీ, మీడియా సెంటర్ పరిశీలన
- గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా: బండి సంజయ్
- Rathnam Movie X Review: రత్నం ట్విట్టర్ రివ్యూ.. యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న