ఢిల్లీలో అమిత్ షాతో తెలంగాణ బీజేపీ లీడర్లు భేటీ

ఢిల్లీలో అమిత్ షాతో తెలంగాణ బీజేపీ లీడర్లు భేటీ

కేంద్ర మంత్రి అమిత్ షాతో రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు . బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్, పార్టీ ముఖ్య నేతలు మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారని తెలుస్తోంది.