తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సునీల్ బన్సల్

తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సునీల్ బన్సల్

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జ్ సునీల్ బన్సల్ తొలిసారి తెలంగాణకు రానున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా హనుమకొండకు వెళ్తారు. అనంతరం రేపు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. 

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా సునీల్‌ బన్సల్‌ ఇటీవలే నియమితులయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ వెంటనే తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు.