మంత్రి వర్గ విస్తరణలో కాంగ్రెస్​ సోషల్​ ఇంజనీరింగ్​ ఫార్ములా

మంత్రి వర్గ విస్తరణలో కాంగ్రెస్​ సోషల్​ ఇంజనీరింగ్​ ఫార్ములా

మంత్రి వర్గ విస్తరణలో కాంగ్రెస్​ సోషల్​ ఇంజనీరింగ్​ ఫార్ములాను అనుసరించింది.  కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలో స్థానం కల్పించారు.  ఎస్పీ మాల.. ఎస్సీ మాదిగ.. బీసీ ముదిరాజ్​ కమ్యూనిటీల నుంచి ఒక్కొక్కరికి చాన్స్​  ఇచ్చారు.  కాంగ్రెస్​ నుంచి 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా .. కొత్తగా  అవకాశంఇచ్చిన వారితో కలుపుకొని నలుగురు ఉన్నారు.  ఇప్పటికే మాల కమ్యూనిటీ నుంచి భట్టి విక్రమార్క.. మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజ నరసింహ ఉండగా  కొత్తగా వివేక్​ వెంకటస్వామి ( మాల) అడ్లూరి లక్ష్మణ్​ కు అవకాశం కల్పించారు.

కాంగ్రెస్​ పార్టీ నుంచి ఏడుగురు బీసీ ఎమ్మెల్యేలు గెలవగా  ప్రస్తుతం ఇద్దరు బీసీ మంత్రులుగా ఉన్నారు.  కొత్తగా ముదిరాజ్​ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి కొత్తగా మంత్రి వర్గంలో చోటు కల్పించారు.  దీంతో తెలంగాణ మంత్రి వర్గంలో బీసీ కమ్మూనిటీకి చెందిన వారు ముగ్గురు మంత్రులు అవుతారు.

ఎస్టీ విషయానికొస్తే ఇప్పటి ఆదివాసీల సామాజిక వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు.  లంబాడీలకు అవకాశం కల్పించకపోవడంతో.. వారిని సంతృప్తి పరిచే విధంగా  రామచంద్రునాయక్​ కు డిప్యూటీ స్పీకర్​ గా అవకాశం ఇవ్వబోతున్నారు.  కొత్తగా మంత్రిగా విస్తరణలో రెడ్డి కమ్యూనిటికి ఛాన్స్​ ఇవ్వలేదు.   ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు.