
తెలంగాణ కేబినెట్ జూలై 25న సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్.
2024, జూలై 23వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుంది. 24వ తేదీ నుంచి మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. 25వ తేదీ లేదా 26న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం.
ఈ సమావేశాల సందర్భంగా రైతు భరోసా,రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే నూతన ఆర్ఓఆర్ యాక్ట్, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలపై కూడా ప్రతిపక్షాలు సమావేశంలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ | సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం:సీఎం రేవంత్ రెడ్డి
గత అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ, ఈ సారి సమావేశాలకు తాను హాజరవుతానని ఇటీవలే ప్రకటించడంతో.. రాబోయే సమావేశాలపై ఆసక్తి నెలకొంది. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని వలసలు జరుగుతాయనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపుల చట్టంపై చర్చించే అవకాశం ఉన్నది.