డిసెంబర్ 14న బాధ్యతలు చేపట్టనున్న ఐదుగురు మంత్రులు

డిసెంబర్ 14న బాధ్యతలు చేపట్టనున్న ఐదుగురు మంత్రులు

హైదరాబాద్, వెలుగు : కేబినెట్ మంత్రులు పలువురు గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. సెక్రటేరియెట్​లో వారికి కేటాయించిన ఫ్లోర్లలో హెల్త్  మినిస్టర్ దామోదర రాజనర్సింహ, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  డిప్యూటీ, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క),  ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం బాధ్యతలు తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నప్పటికి ఇంకా ఖరారు కాలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.