సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. హైదరాబాద్ ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణపై చర్చించనున్నారు. దీంతో పాటు పలు అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
ఈ మంత్రివర్గ సమావేశం అనంతంర తెలంగాణ భవన్ లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై నేతలు చర్చించనున్నట్టు సమాచారం.