తెలంగాణ సీఐడి చీఫ్ గోవింద్ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. రాజస్థాన్ లోని రాంగఢ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన సతీమణి మృతి చెందారు. రాజస్థాన్లోని తానుమాతా టెంపుల్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో గోవింద్ సింగ్ కు తీవ్ర గాయలు కాగా, కారు డ్రైవర్ పరిస్థితి విషమం ఉంది. వారిద్దరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన గోవింద్ సింగ్ ను ఏసీబీ డీజీగా 2021 సెప్టెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం నియమించింది.