హనుమకొండ కలెక్టరేట్/ భూపాలపల్లి రూరల్/ కాశీబుగ్గ/ భద్రాచలం, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి వచ్చిన 268 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ చాహత్బాజ్పాయ్తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లిలో 78 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ రాహుల్శర్మ పేర్కొన్నారు. వరంగల్కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద 192 అర్జీలు, బల్దియాలో 128 అర్జీలను కమిషనర్ టి.వెంకటన్న స్వీకరించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ మీటింగ్హాల్లో నిర్వహించిన గిరిజన దర్భార్లో పీవో బి.రాహుల్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వకరించి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.
