ఏపీ అక్రమ ప్రాజెక్టుపై చర్యలు తీసుకోండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ఏపీ అక్రమ ప్రాజెక్టుపై చర్యలు తీసుకోండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. తాజాగా ఇరిగేషన్​ఈఎన్సీ మురళీధర్​ కేఆర్ఎంబీ చైర్మన్ శివ్​నందన్​కుమార్​కు ఫిర్యాదు  ​చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో 4,100 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసేలా కొత్త లిఫ్ట్​ స్కీమ్​కు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అపెక్స్​ కౌన్సిల్​ సహా ఎలాంటి అనుమతులు లేవని  వివరించారు.