హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. తాజాగా ఇరిగేషన్ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మన్ శివ్నందన్కుమార్కు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో 4,100 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసేలా కొత్త లిఫ్ట్ స్కీమ్కు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్ సహా ఎలాంటి అనుమతులు లేవని వివరించారు.