కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కేసీఆర్ వెనుకంజ

కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కేసీఆర్ వెనుకంజ

తెలంగాణలో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.  కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సీఎం కేసీఆర్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ముందంజలో ఉన్నారు. బీజేేపీకి 365 ఓట్లు పోలయ్యాయి.

ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. 49 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 10 గంటల వరకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది.