హామీలు తప్ప.. అభివృద్ధి లేదు: రాజ్ నాథ్ సింగ్

హామీలు తప్ప.. అభివృద్ధి లేదు: రాజ్ నాథ్ సింగ్

మెహిదీపట్నం, వెలుగు: పదేండ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకు హామీలు ఇచ్చుడు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని కార్వాన్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. దర్బార్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జియాగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్ నాథ్ మాట్లాడారు.

కార్వాన్ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్ ను గెలిపిస్తే, ఇక్కడి సీనియర్ సిటిజన్లకు ఫ్రీగా అయోధ్య దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. ‘‘1984లో బీజేపీ నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచారు. వారిలో ఒకరు గుజరాత్ నుంచి కాగా, మరొకరు తెలంగాణ నుంచే ఉన్నారు” అని గుర్తు చేశారు.