డైలమాలో ఆశావహులు : కాంగెస్​, బీజేపీల్లో భారీగా అప్లికేషన్లు

డైలమాలో ఆశావహులు : కాంగెస్​, బీజేపీల్లో  భారీగా అప్లికేషన్లు
  •     ఎవరికి టికెట్​ వస్తుందో తెలియక టెన్షన్​  ​ 
  •     టికెట్​ వచ్చేదాక వెయిట్​చేయాలని ఆలోచన   

మెదక్​, వెలుగు:మెదక్, నర్సాపూర్ స్థానాలనుంచి  కాంగ్రెస్, బీజేపీ టికెట్ ఆశిస్తున్న నేతలు డైలమాలో ఉన్నారు. ఈ రెండు చోట్ల ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి అవకాశం దక్కనుందోనన్న ఉత్కంఠ  నెలకొంది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారితో పాటు  కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా  టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం ఈ పరిస్థితికి కారణం. టికెట్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో  ధీమాగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, కార్యక్రమాలు నిర్వహించిన లీడర్లు ఇప్పటి నుంచే  ఖర్చు పెట్టడం ఎందుకని స్పీడ్​ తగ్గించారు. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే ముందువెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు.    

భారీగా ఆశావహులు 

మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం 12 మంది దరఖాస్తు చేశారు.  ఇందులో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి​ తిరుపతిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బాలకృష్ణ, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత్​ రావ్, డీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు తదితరులు ఉన్నారు. బీజేపీ టికెట్​ కోసం జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రాజశేఖర్, నందు జనార్ధన్​ రెడ్డి, కరణం పరిణీత, అధికార ప్రతినిధి నందారెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాంచరణ్​ యాదవ్, అడ్వకేట్​ సుభాష్​చంద్రగౌడ్, నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్​ కుమార్​ దరఖాస్తు చేశారు.   

నర్సాపూర్ నుంచి  కాంగ్రెస్ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్​ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, నాయకులు రవీందర్​ రెడ్డి దరఖాస్తు చేశారు.  బీజేపీ టికెట్ కోసం నర్సాపూర్​ మున్సిపల్​చైర్మెన్​ మురళీ యాదవ్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, అసెంబ్లీ కన్వీనర్​ మల్లేశ్​ గౌడ్​, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేశ్​  గౌడ్​, సీనియర్​ నాయకులు రఘువీరా రెడ్డి, పాపగారి రమేశ్​ గౌడ్​ దరఖాస్తు చేసుకున్నారు.   

 
హైకమాండ్​ చుట్టూ చక్కర్లు

 

 

 

రెండు పార్టీల్లోనూ టికెట్​ పోటీ తీవ్రంగా ఉంది. ఎవరికి వారే తమ గాడ్​ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.   మెదక్ మాజీ ఎమ్మెల్యే  పట్లోళ్ల శశిధర్​ రెడ్డి  ఇటీవల బీజేపీకి రిజైన్​ చేసి తిరిగి   కాంగ్రెస్​లో చేరారు.  గతంలో తనకు కాంగ్రెస్​ పెద్దలతో ఉన్న పరిచయాల మేరకు  ప్రయత్నాలు చేసుకుంటున్నారు.   టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్​ కూడా   కాంగ్రెస్​ టికెట్​కోసం గట్టిగానే  ప్రయత్నిస్తున్నారు. 

బీఆర్​ఎస్​కు  రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన  నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​ కుమార్   తన సామాజిక వర్గానికే చెందిన  బీజేపీ ఎలక్షన్​ కమిటీ చైర్మన్​ ఈటల రాజేందర్​ను నమ్ముకున్నట్టు  తెలుస్తోంది. నర్సాపూర్​ నుంచి  టికెట్​ ఆశిస్తున్న  టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్​ కుమార్ కాంగ్రెస్​ పెద్దలతో టచ్​ ఉంటున్నారు.    నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మెన్​ మురళీ యాదవ్​ టికెట్​బీజేపీ టికెట్​ రేసులో ఉన్నారు.  వీరిలో హైకమాండ్​ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో.. ఎవరికి అవకాశం వస్తుందో అన్న సస్పెన్స్​ పార్టీ నేతల్లో కొనసాగుతోంది.  

నర్సాపూర్​ బీఆర్ఎస్​లో సైలెన్స్​

115 సెగ్మెంట్లకు క్యాండేట్లను ప్రకటించిన బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ మెదక్​ జిల్లా నర్సాపూర్ అభ్యర్థిని పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. నెలరోజులవున్నా క్యాండేట్​ను ఫైనల్​ చేయకపోవడంతో క్యాడర్​లో అయోమయం నెలకొంది.  ఇక్కడ సిటింగ్​ఎమ్మెల్యే మదన్​రెడ్డితోపాటు మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి టికెట్​ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిలో ఎవరికి టికెట్​ ఇచ్చినా ఇంకొకకరిని ఒప్పించడం పెద్ద కష్టమైన పనికాదని, కానీ ఎందుకు ఇంతలా డిలే చేస్తున్నారో అర్థం కాక  లీడర్లు, కార్యకర్తలు అయోమయం చెందుతున్నారు. మరోవైపు దీంతోపాటు పెండింగ్​ పెట్టిన జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు అక్కడి నుంచి టికెట్​ ఆశిస్తున్న పల్లా రాజేశ్వర్​రెడ్డి మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. 

వారిద్దరినీ శుక్రవారం ప్రగతిభవన్​కు పిలిచి మాట్లాడిన మంత్రి కేటీఆర్ పల్లాకు టికెట్ ఇచ్చేలా ముత్తిరెడ్డిని ఒప్పించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఒకటి, రెండు రోజుల్లో నర్సాపూర్​ ఇష్యూ ను సైతం సెట్​ చేసే చాన్స్​ కనిపిస్తోంది. కానీ మదన్​రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలేదు అంటున్నారు. తాను పబ్లిక్​ మనిషినని, నిజాయతీగా పనిచేసే తనను పక్కనపెడ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని మదన్​రెడ్డి అంటున్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో పోటీచేసుడు పక్కా అంటున్నారు. అదే సమయంలో సునీతారెడ్డి కూడా తనకు టికెట్​ఇచ్చేందుకే మదన్​రెడ్డి పేరును ప్రకటించలేదని చెప్తున్నారు. జనగామ ఇష్యూను పరిష్కరించినట్లే ఒకటి, రెండు రోజుల్లో నర్సాపూర్​ టికెట్​సంగతినీ తేల్చేస్తారనే చర్చ జరుగుతోంది. వెయిట్​ అండ్​ సీ.