హైదరాబాద్ చైతన్య పురిలో భారీగా నగదు పట్టుబడింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టిన మహేశ్వరం జోన్ SOT పోలీసులు రూ. 60 లక్షల నగదును సీజ్ చేశారు. చైతన్యపురి PS పరిధిలోని సాయిబాబా దేవాలయం ఎదురుగా ఉన్న దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ చెక్ పోస్ట్ వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని తనికీ చేయగా..అతని దగ్గర రూ. 60 లక్షలు లభించాయి.
సరూర్ నగర్ లో నివసిస్తున్న బిరధార్ సిద్దేశ్వర్, బి.శంకర్ రెడ్డి లు బైక్ పై దిల్సుఖ్నగర్ వైపు వెళ్తుండగా..రాజధాని థియేటర్ సమీపంలో చైతన్య పురి పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా రూ. 60 లక్షలు నగదును తరలిస్తుండగా ఎస్ ఓ టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు స్థానికుల సమక్షంలో నగదును లెక్కించి చైతన్యపురి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తదుపరి చర్యల నిమిత్తం పట్టుబడిన నగదును ఐటీ శాఖకు ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి. సాయి శ్రీ తెలిపారు