
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్తో పీజేఆర్తనయుడు విష్ణువర్ధన్రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్లో ఆయన సీఎంతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల కింద ప్రకటించిన సెకండ్లిస్ట్లో విష్ణువర్ధన్రెడ్డికి చోటు దక్కలేదు. ఆయనజూబ్లీహిల్స్టికెట్ ఆశించగా, అది మహ్మద్అజారుద్దీన్కు కేటాయించారు.
ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ అనుచరులు శనివారం గాంధీభవన్లో ఆందోళన నిర్వహించారు. విష్ణువర్ధన్తో బీజేపీ నేతలు సంప్రదింపులు జరపగా, ఇప్పుడాయన సీఎం కేసీఆర్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.