అచ్చంపేట, వెలుగు: అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ దోపిడీ పాలనతో ఆగమవుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానిక్రావు ఠాక్రే ఆరోపించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం సాయంత్రం అచ్చంపేటకు చేరుకున్న సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు పదివేల మందితో స్వాగతం పలికారు.
ఈ పాదయాత్రలో ఠాక్రే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తర్వాత భట్టి చేస్తున్న యాత్ర మరో భారత్ జోడో యాత్రగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎల్పీ నేత సెల్వా పెర్తుంగై, ఏఐసీసీ సెక్రెటరీ సిరివెళ్ల ప్రసాద్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వీహెచ్, బెల్లయ్య నాయక్, శివసేనారెడ్డి , మల్లురవి, నాగం జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

