హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారా నికి ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. సోమవారానికి ఏ అలర్ట్ ఇవ్వలేదు. మళ్లీ మంగళ, బుధవారాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పింది. కాగా, శనివారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.