
హైదరాబాద్ సిటీ, వెలుగు: అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జీహెచ్ఎంసీకి బిగ్రిలీఫ్లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రూ.1,327కోట్లను జీహెచ్ఎంసీ పీడీ(పర్సనల్డిపాజిట్) అకౌంట్ లో జమ చేసింది. ఈ విషయాన్ని బల్దియా అధికారులు శనివారం వెల్లడించారు.
2025–-26 బడ్జెట్లో సర్కారు బల్దియాకు రూ. 2,654 కోట్లు కేటాయించగా, ముందుగా రూ.1,327 కోట్లను రిలీజ్చేసింది. ఈ మొత్తాన్ని హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్ సిటీ) పనుల కోసం జీహెచ్ఎంసీ పీడీ అకౌంట్ లో ఈ నెల 30వ తేదీన జమ చేసింది.