హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని మూసీ నది వెంట కొత్త సర్వీస్ రోడ్డు నిర్మించడానికి అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మంచిరేవుల గ్రామానికి చెందిన 2.19 ఎకరాల భూమి సేకరించాలని సోమవారం మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో జారీ చేశారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 18 ఏ నుంచి నార్సింగి వరకు సర్వీస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది.
కానీ గతంలో జారీ చేసిన జీవో 120 ప్రకారం ఈ భూమి నార్సింగిలో ఉందని పేర్కొనగా తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ భూమి గండిపేట్ మండలం మంచిరేవులది చెందినదిగా పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ భూసేకరణ అంత్యంత అవసరమని గుర్తించిన ప్రభుత్వం పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో జారీ చేశారు. భూమి విస్తీర్ణం మార్చకుండా కేవలం గ్రామం పేరు మాత్రమే సరిచేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు.
