సాధారణ బదిలీల గడువు 31 వరకు పొడిగింపు

సాధారణ బదిలీల గడువు 31 వరకు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సాధారణ బదిలీల​ గడువును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 5 నుంచి 20 వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా మొదట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. గైడ్ లైన్స్​కు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 

దీంతో ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ స్పెషల్​ సీఎస్​రామకృష్ణరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అయితే, కొందరు ఉద్యోగ సంఘాల నేతలు, మరికొందరు ఉద్యోగులు అక్రమంగా బదిలీల నుంచి తప్పించుకుంటున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే కొన్ని శాఖల్లో బదిలీలు వాయిదా పడ్డాయి.