2019
- ఆగస్టు 12: రాయలసీమను రతనాల సీమగా మారుస్త. జగన్కు పెద్దన్నగా కష్టాలు తీర్చడంలో నా ఆశీస్సులు, సహకారం ఉంటాయి. ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు.. మరికొందరికి అజీర్తా చేయొచ్చు: నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంట్లో కేసీఆర్ కామెంట్లు
- నవంబర్ 18: కృష్ణాపై ఏపీ కొత్త లిఫ్ట్ శీర్షికన ‘వీ6 - వెలుగు’ మొదటి కథనం
- డిసెంబర్ 12: ‘వెలుగు’ కథనాల ఆధారంగా పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ఈఎన్సీ కంప్లైంట్
- డిసెంబర్ 13: పోతిరెడ్డిపాడు విస్తరణకు జగన్ ప్లాన్.. తెలంగాణకు నష్టంపై ‘వీ6-వెలుగు’ కథనాలు
2020
- మే 5: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం ఏపీ ప్రభుత్వం జీవో నం. 203 జారీ.. రూ.6,820 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతి
- మే 6: సంగమేశ్వరం ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్తూ ‘వీ6– వెలుగు’ కథనాలు
- మే 12: పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టులపై కేఆర్ఎంబీ చైర్మన్కు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు
- మే 21: ఏపీ అక్రమ ప్రాజెక్టుల ప్లాన్ పై ఎన్జీటీలో రైతు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్. వెంటనే స్టే ఆదేశాలు జారీ చేసిన ఎన్జీటీ
- జూన్ 3: ‘వీ6– వెలుగు’ వరుస కథనాలతో మరోసారి కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్
- ఆగస్టు 5: కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై మీటింగ్ సాకుతో అపెక్స్ కౌన్సిల్ భేటీని వాయిదా వేయించిన సీఎం కేసీఆర్
- ఆగస్టు 19: సంగమేశ్వరం టెండర్ల ప్రాసెస్ పూర్తిచేసిన జగన్ సర్కారు
- ఆగస్టు 21: ఎన్జీటీలో రైతు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ పై తీర్పు రావాల్సిన రోజే కేసీఆర్ సర్కారు రీఓపెన్ పిటిషన్ ఫైల్ చేసింది. దీంతో తీర్పు వాయిదా పడింది.
- అక్టోబర్ 6: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ కు జరిగిన నష్టంపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన కేసీఆర్.. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై అనుకున్న స్థాయిలో చెప్పని సీఎం
- అక్టోబర్ 29: ఏపీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ తీర్పు.. రాష్ట్ర సర్కారు పిటిషన్ వల్లే రెండు నెలలు లేటుగా తీర్పు
- డిసెంబర్ 13: సంగమేశ్వరం దగ్గర అక్రమంగా పనులు సాగుతున్నయని విజువల్స్, ఫొటోలతో ‘వీ6–వెలుగు’ స్టోరీలు
- డిసెంబర్ 19: సంగమేశ్వరం పనులపై కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ ఈఎన్సీ ఫిర్యాదు
- డిసెంబర్ 22: ఎన్జీటీ తీర్పును ఏపీ ధిక్కరించినట్లు గవినోళ్ల శ్రీనివాస్ పిటి షన్. దీనిపై పిటిషనే వేయని సర్కారు.
2021
- మార్చి 20: సంగమేశ్వరంపై కేఆర్ఎంబీకి రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ ఫిర్యాదు
- జూన్ 9: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాష్ట్ర ఈఎన్సీ కంప్లైంట్
- జూన్ 24: ఆరునెలల ముందే ‘వీ6– -వెలుగు’లో ఫొటోలు, విజువల్స్ వచ్చినా సంగమేశ్వరంలో పనుల ఫొటోలే దొరకలేదన్న మంత్రి ప్రశాంత్రెడ్డి
- జూన్ 25: సంగమేశ్వరం పనులు చేస్తున్నట్లు ఈ మధ్యే తెలిసిందన్న మంత్రి జగదీశ్ రెడ్డి
- జూన్ 25: గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ ఆధారంగా ఎన్జీటీ విచారణ, పనులు జరుగుతున్నట్లు తేలితే ఏపీ సీఎస్ను జైలుకు పంపిస్తామని వార్నింగ్
- జూన్ 26: ఏడాదిన్నర పాటు సోయిలేనట్లుగా ఉన్న రాష్ట్ర మంత్రుల వరుస ప్రెస్ మీట్లు.. వీధిపోరాటాలు చేస్తాం, మానవబాంబులు అవుతాం అంటూ జనాన్ని రెచ్చగొట్టే మాటలు