8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

హైదరాబాద్‌, వెలుగు: ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొత్తం 14 మంది ఐఏఎస్​లను ట్రాన్స్​ఫర్​ చేసింది. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​కుమార్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనితా రామచంద్రన్‌ను నియమించారు. కామారెడ్డి కలెక్టర్‌‌ శరత్‌ను పంచాయతీ రాజ్‌ అండ్  రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ డిపార్ట్​మెంట్​కు  కమిషనర్‌‌గా ఉన్న రఘునందన్‌రావును అగ్రికల్చర్‌‌ కమిషనర్‌‌గా ట్రాన్స్​ఫర్​ చేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్​ను ఇండస్ట్రీస్  డైరెక్టర్‌‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న డాక్టర్ వి.వెంకటేశ్వర్లును యూత్‌ సర్వీసెస్‌  డైరెక్టర్‌‌గా, మహమ్మద్‌ అబ్దుల్ అజీమ్‌ను మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు.