ఇవాళ్టి(జూన్2) నుంచి అన్ని సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో స్లాట్​ బుకింగ్

ఇవాళ్టి(జూన్2) నుంచి అన్ని సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో  స్లాట్​ బుకింగ్

 

  • ఏఐ ఆధారిత వాట్సాప్​ సేవలు కూడా..
  • ఆస్తుల క్రయవిక్రయాల్లో సమయం ఆదా, పారదర్శకతే లక్ష్యం
  • మంత్రి  పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ ‘మేధ’ సేవలను ప్రవేశపెడుతున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి  ప్రకటించారు. ఇప్పటికే రెండు దశల్లో 47 కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. సోమవారం నుంచి మిగతా 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుందని తెలిపారు.  ఆస్తుల క్రయవిక్రయాల్లో సమయం ఆదా జేయడం, పారదర్శకత పాటించడం, అవినీతి రహిత సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఒక్కో సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉదయం 10.30 నుంచి సాయం త్రం 5 గంటల వరకు రోజుకు 48 స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. అత్యవసర సందర్భాల్లో సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య 5 వాక్​ఇన్​  రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

వాట్సాప్​ చేస్తే వివరాలు వచ్చేస్తయ్​

ఏఐ ఆధారిత చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్ ‘మేధ’ను వాట్సాప్ నంబర్ 82476 23578 ద్వారా అందుబాటు లోకి తెచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ సందేహాల నివృత్తి, కార్యాలయ లొకేషన్, స్లాట్ ఖాళీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ ధరల వివరాలు ఈ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్

లేఅవుట్లలో డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు ‘డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్’ను త్వరలో ప్రవేశపెడతామని, రిజిస్టర్ అయిన ప్లాట్లు రెడ్ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తాయని మంత్రి పొంగులేటి వివరించారు. పనిభారం ఎక్కువగా ఉన్న పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు, యాదగిరిగుట్ట, గండి పేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వనపర్తి, గద్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద నపు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిని నియమించి నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవం తం చేసేందుకు ఆధార్- –ఈ సంతకం విధానాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.