- శాశ్వాత జడ్జీలుగా సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న ఇద్దరు న్యా యమూర్తులకు శాశ్వత జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సీజేఐ నియమించిన కొలీజియం అదనపు జడ్జీలు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస రావు, జస్టిస్ నామ వరపు రాజేశ్వర్ రావు పేర్లను మంగళ వారం కేంద్రానికి పంపింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 13న తెలంగాణ హైకోర్టు కొలీజియం ఈ ఇద్దరు జడ్జీల పేర్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసి సుప్రీంకోర్టు కొలీ జియానికి పంపింది. ఇందులో భాగంగా అదనపు జడ్జీలుగా వారిచ్చిన తీర్పులు సంతృప్తికరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయానికి వచ్చింది.