ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో జరిగిన ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని  ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 28న ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలను మేలో నిర్వహించారు. మే 06వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 9 లక్షల 7 వేల 396 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. 70శాతం సిలబస్ తోనే పరీక్షలు జరిగాయి. వాస్తవానికి ఎగ్జామ్స్ పూర్తయిన నెల రోజుల్లోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్ గతంలో వెల్లడించారు. ఆ విధంగా అనుకున్న తేదీ కాకపోయినా..అటు..ఇటుగా ఫలితాలను విడుదల చేస్తున్నారు.