ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ .. వసంత్ విహార్ లో కొత్తగా నిర్మించిన  బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసును అనుకున్న ముహుర్తానికి  ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగు పెట్టారు. అంతకుముందు పార్టీ నేతలతో కలిసి ఆఫీసు ఆవరణంలో ఏర్పాటు చేసిన  బీఆర్ఎస్ జెండాను అవిష్కరించారు.  అనంతరం మొదటి అంతస్థులోని తన ఛాంబర్ లోకి వెళ్లి సీటులో కూర్చున్నారు.  ఈసందర్భంగా కేసీఆర్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రారంభోత్సవం  తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం తొలి సమావేశం కానున్నారు.  


2021, సెప్టెంబర్ 2న ఆఫీసు నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 11వేల చదరపు అడుగుల స్థలంలో బిల్డింగ్ నిర్మించారు. జీ ప్లస్​3 ఫ్లోర్లు కలిగిన ఈ బిల్డింగ్​లో మొత్తం 20 రూంలు ఉంటాయి. అంతేకాకుండా, స్పెషల్​గా రెండు సూట్​ రూంలు కూడా నిర్మించారు. ఫస్ట్​ ఫ్లోర్​లో కేసీఆర్ ఆఫీస్, ఆయనకు స్పెషల్​ సూట్​ రూం కేటాయించారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మరో సూట్ రూంను ఏర్పాటు చేశారు.  మొత్తం: రూ. 8.64 కోట్లతో సెంట్రల్ ఆఫీసును నిర్మించారు.