
బషీర్బాగ్, వెలుగు : తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. గురువారం వర్సిటీలో పెన్డౌన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వర్సిటీల్లో 1,400 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
తాము 30 ఏండ్లుగా టీచింగ్ చేస్తూ ఎంతో మంది స్టూడెంట్లకు విద్యను అందిస్తున్నామని అయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తాము విధులను బహిష్కరించి పెన్డౌన్ చేసినా ప్రభుత్వం దిగి రాకపోవడం దారుణమన్నారు. తక్షణమే తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే వర్సిటీల్లో విద్యను స్తంభింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫె
సర్స్ నరసింహారావు , యాదయ్య , శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.