ఒక్క గజం ఎక్కువున్నా దానం చేస్తా

ఒక్క గజం ఎక్కువున్నా దానం చేస్తా

హైదరాబాద్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణల మీద మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తన పాస్‌‌బుక్‌‌లో ఉన్నదాని కంటే ఒక్క గజం భూమి ఎక్కువున్నా దానం చేస్తానన్నారు. బండి సంజయ్ మాటలు సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఎవరు కాగితం తీసుకొచ్చి ఇచ్చినా చదివేస్తారా అంటూ మండిపడ్డారు.

‘ఎవడో లుచ్చగాడు కాగితం ఇస్తే బండి సంజయ్ చదువుతారా?  మేం కష్టపడి కొనుకున్నాం. అమ్మినోళ్లు అందరూ బతికే ఉన్నారు. మా తాత చిన్న ఇంట్లో ఉండేవాడు. అలాగని నేను మంచి ఇల్లు కట్టుకోవొద్దా? బండికి ఛాలెంజ్ చేస్తున్నా.. నా పాస్‌‌బుక్‌‌లో ఉన్నదాని కంటే ఒక్క గజం ఎక్కువ ఉంటే మొత్తం దానం చేస్తా. ఆయన చెప్పిన సర్వే నంబర్‌‌ పట్టాభూమి కాకుంటే నా మొత్తం ఆస్తి దానం చేసేస్తా. నా దగ్గర ఉన్న సర్వే నంబర్లు తప్పయితే అన్ని పదవులకు రాజీనామా చేస్తా. నిజం కాకపోతే సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా?’ అని శ్రీనివాస్ సవాల్ విసిరారు.