వనస్థలిపురంలో కరోనా చిల్డ్రన్ వార్డ్

వనస్థలిపురంలో కరోనా చిల్డ్రన్ వార్డ్

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 100పడకల వార్డు తో పాటు కరోన పిల్లల విభాగాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు.  కరోన సెకండ్ వేవ్ సందర్భముగా నగరంలో అదనపు పడకలు ఏర్పాటు  చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు  హైద్రాబాద్ లో ఏర్పాటు చేయమన్నారు. నిలోఫర్ లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా  వనస్థలిపురంలో 100 పడకలు ఏర్పటు చేసుకున్నట్లు తెలిపారు. అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వానికి సహకరించాలన్నారు. 24 లక్షలు హోమ్ ఐసోలాషన్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు.  దల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్నా రాష్ట్రము తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందన్నారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ఇచ్చారన్నారు. 

ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషలాటి ఆసుపత్రి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని హరీశ్ రావు తెలిపారు. మన బస్తి దవాఖానాలు దేశానికి ఆదర్శమన్నారు. నగరంలో ఎక్కడ ఇంకా ఎక్కువ అవసరం ఉన్న ఆ ప్రాంతంలో మరిన్ని బస్తి దవాఖానాలు ప్రారంభించమని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. మున్సిపాలిటీలో కూడా బస్తి దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కోవిడ్ దృష్టి లో పెట్టుకొని అదనంగా వైద్యలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలని మంత్రి సూచించారు. కోవిడ్ టీకా సురక్షితమన్నారు. వ్యాధి లక్షణాలు కొంచెం ఉన్న పరీక్షలు చేసుకోవాలన్నారు. ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువన్నారు మంత్రి హరీశ్ రావు. 

ఇవి కూడా చదవండి:

కేసీఆర్ ప్లానేంటో రాబోయే రోజుల్లో చూస్తారు

 దళిత బంధు వంద శాతం అమలు చేయాలి